న్యూఢిల్లీ: తాను మరణించినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్ ఖండించారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు పరేశ్ కన్నుమూసినట్టు ట్విట్టర్ లో ఎవరో వార్త పెట్టారు. దీనిపై ఆయన సరదాగా స్పందించారు.
“అపోహ కలిగించినందుకు మన్నించాలి. ఉదయం 7 దాటి నిద్రపోయానంతే” అని ఆయన ట్విట్టర్ లో పోస్టు పెట్టారు. ఆ మెసేజ్ కు ముందు రెండు చేతులా దండం పెట్టే ఇమోజీని కూడా పెట్టారు. దీనిపై ఆయన అభిమానులు స్పందించారు.
కొందరు శతమానం భవతి అంటే మరికొందరు తప్పుడు ట్వీట్ పెట్టిన వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకోమని సూచించారు. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అనుకునే ఈ రోజుల్లో అలాంటి ట్వీట్లను ఏమాత్రం వదిలిపెట్టరాదని నొక్కిచెప్పారు.