న్యూఢిల్లీ : పారా ఒలింపిక్స్-2020 కోసం భారత్ నుంచి 54 మంది అథ్లెట్ల బృందం మంగళవారం జపాన్ వెళ్లనుంది. ఈ సందర్భంగా వారితో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించనున్నారు. టోక్యోలో పారా ఒలింపిక్స్ పోటీలు ఈ నెల 24 నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు కొనసాగనున్నాయి. భారత్ నుంచి 54 మంది పారా అథ్లెట్లు టోక్యోకు వెళ్తుండగా.. వీరంతా తొమ్మిది రకాల పోటీల్లో భారత్కు ప్రాతినిథ్యం వహిస్తారని పీఎంఓ పేర్కొంది. ఈ క్రమంలో మంగళవారం ప్రధాని క్రీడాకారులతో భేటీకానున్నారు. పారా ఒలింపిక్స్లో భారత్ నుంచి ఈ పెద్ద మొత్తంలో క్రీడాకారులు పాల్గొంటుండడం ఇదే తొలిసారి. వీడియోకాన్ఫరెన్స్లో కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సైతం పాల్గొననున్నారు.