న్యూఢిల్లీ: రిఫైన్డ్ పామాయిల్ వంటనూనెపై దిగుమతి సుంకాన్ని 12.5 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ వంటనూనె ధరలు మరింత తగ్గనున్నాయి. గతంలో దిగుమతి సుంకం 17.5 శాతంగా ఉండింది. దేశీయంగా సరఫరా వ్యవస్థకు ఊతమివ్వడానికి ఈ నిర్ణయం దోహదం చేయనున్నది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు దిగుమతి సుంకం తగ్గింపు అమల్లో ఉంటుందని వెల్లడించింది.