నాగర్ కర్నూల్ : పాలమూరు ఎత్తిపోతల(Palamuru Lift) పనులు త్వరలో పూర్తికానున్నాయని, వీటి ద్వారా రైతులకు సాగునీరందించి దశాబ్దాల నాటి కలను నెరవేర్చనున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి(Minister Niranjan reddy) అన్నారు. నాగర్ కర్నూలు నియోజకవర్గం తెల్కపల్లి మండల బీఆర్ఎస్(Brs) కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఒక్క ఎకరాకు కృష్ణమ్మ నీళ్లు రాని ప్రాంతంలో ఎన్నో మార్పులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని వెల్లడించారు. శరవేగంతో పెండింగ్ ప్రాజెక్టులు(Pending Water) పూర్తిచేసి కల్వకుర్తి ఎత్తిపోతలకు 40 టీఎంసీలు నీటిని కేటాయించిందని అన్నారు.1984 నుంచి 2014 వరకు గత పాలకుల హయాంలో కల్వకుర్తి(Kalwakurti) ఎత్తిపోతల పనులను సాగదీశారని ఆరోపించారు.కేసీఆర్ (KCR)ముఖ్యమంత్రి అయ్యాక, హరీశ్రావు సాగునీటి శాఖా మంత్రిగా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా తాను ప్రాజెక్టు పనులను పరిశీలించి సాగునీళ్లు పారించామన్నారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తయితే ఉమ్మడి జిల్లాలో 10 లక్షల ఎకరాలు సాగుఅవుతాయని వివరించారు. ‘ ప్రభుత్వం ప్రాజెక్టు పనులు మొదలు పెట్టగానే అటు ఆంధ్రా ప్రభుత్వం, ఇటు తెలంగాణ ఇంటి దొంగలు 190 రకాల కేసులు వేశారు.ప్రాజెక్టు పూర్తయి ప్రజలకు మేలు జరిగితే తమకు రాజకీయంగా పుట్టగతులుండవని అడ్డుకునే ప్రయత్నం చేశార’ని ఆరోపించారు.ప్రాజెక్ట్ మొదలుపెట్టి కేవలం మూడేళ్లలో కాళేశ్వరం(Kaleshwaram) ఎత్తిపోతల పూర్తి చేసిన ఏకైక మొనగాడు ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) అని ప్రశంసించారు.
అంబలికేంద్రాలు నడిచిన చోట ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టాం. గంజి కేంద్రాల కోసం, అంబలికేంద్రాల కోసం, 2 రూపాయల బియ్యం కోసం చూసిన తెలంగాణ నేడు దేశానికి బువ్వపెట్టే స్థాయికి ఎదిగిందని అన్నారు .భాషా, సంస్కారం లేని వాళ్లు ప్రతి రోజూ కేసీఆర్ ను విమర్శించడం సిగ్గుచేటని విమర్శించారు. పేదల డబ్బు దోచి పెద్దలకు, కార్పొరేట్లకు దోచిపెడుతున్న వారు కేంద్రాన్ని ఏలుతున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నతదితరులు పాల్గొన్నారు.