గోపీచంద్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా పక్కా కమర్షియల్. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాశీఖన్నా నాయికగా నటిస్తున్నది. ఈ సినిమాలోని తొలి లిరికల్ పాటను ఫిబ్రవరి 2న విడుదల చేస్తున్నారు. జన్మించినా మరణించినా ఖర్చే ఖర్చు…జీవించడం అడుగడుగునా ఖర్చే ఖర్చు అంటూ సాగే ఈ పాటను దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించారు. జీవిత సారాన్ని మరోసారి తన పాటలో ఆవిష్కరించారు సిరివెన్నెల. ఆయన రాసిన చివరి స్ఫూర్తిదాయక గీతం ఇదే. త్వరలో పక్కా కమర్షియల్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.