సుల్తాన్బజార్,డిసెంబర్ 28: ఉస్మానియా దవాఖానలో రెండు అరుదైన శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఆ వివరాలను మంగళవారం సూపరిండెంటెంట్ డాక్టర్ నాగేందర్ వెల్లడించారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న యాదాద్రి జిల్లా చౌటుప్పల్, పీపల్ పహాడ్కు చెందిన ఉపేందర్(23) ఉస్మానియాలో చేరాడు. అతడికి కార్డియో తోరాసిక్ సర్జరీ విభాగం వైద్యులు మిట్రాల్ వాల్వ్ రీప్లేస్మెంట్ శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఉపేందర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో మంగళవారం డిశ్చార్జి చేశారు.
అలాగే మూత్ర పిండ వ్యాధితో బాధపడుతున్న మహిళ(55)కు కిడ్నీలో లియోమియోసార్కోమా కణితి ఏర్పడందని గుర్తించిన యూరాలజీ విభాగం,అనస్థీషియా విభాగం వైద్యులు..అరుదైన రైట్ రాడికల్ సెప్రెక్టమీ చేశారు. నాలుగు కిలోల కణితిని తొలగించారు. పేద రోగులకు అరుదైన శస్త్ర చికిత్సలను నిర్వహించిన వైద్య బృందాలను సూపరింటెండెంట్ ప్రత్యేకంగా అభినందించారు. కొవిడ్ కాలం నుంచి ఇప్పటివరకు వెయ్యి పీఎస్ఎన్ఎల్, సుమారు 50 లాపరోస్కోపిక్ ఆపరేషన్లు నిర్వహించినట్లు చెప్పారు.