న్యూఢిల్లీ: తమిళ నటుడు సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ‘జై భీమ్’ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. సినీ పరిశ్రమలో అత్యుత్తమ పురస్కారంగా పిలిచే అకాడమీ అవార్డు (ఆస్కార్) అధికారిక యూట్యూబ్ ఛానెల్లో ‘సీన్ ఎట్ ది అకాడమీ’ పేరుతో ఈ సినిమాకు సంబంధించిన ఓ సన్నివేశాన్ని అప్లోడ్ చేశారు. అకాడమీ యూట్యూబ్ వేదికగా ఒక తమిళ సినిమా వీడియోను ఉంచడం ఇదే తొలిసారి. జస్టిస్ చంద్రు న్యాయవాదిగా ఉన్నప్పుడు వాదించిన ఓ కేసును ఆధారంగా ‘జై భీమ్’ చిత్రాన్ని రూపొందించారు.