హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): త్వర లో రానున్న గ్రూప్ -1 నోటిఫికేషన్లో అభ్యర్థులు దరఖాస్తు సమయంలో ఐచ్ఛికాలు (ఆప్షన్స్) ఇచ్చేలా మార్పులు చేయాలని టీఎస్పీఎస్సీ అధికారులు యోచిస్తున్నారు. 19 శాఖలకు చెందిన 503 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ రానున్నది. కొన్ని పోస్టులకు సమాన అర్హతలు, కొన్నింటికి ప్రత్యేక అర్హతలున్నాయి. కామన్ పోస్టులకు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారంతా పోటీపడే అవకాశం ఉండగా, ప్రత్యేక అర్హతలు అవసరమైన పోస్టులకు సంబంధిత అభ్యర్థులే పోటీపడాలి. ఇందుకు దరఖాస్తు సమయంలోనే ఐచ్ఛికాలు ఇవ్వాలని టీఎస్పీఎస్సీ అధికారులు యోచిస్తున్నారు. అభ్యర్థి ఎన్ని పోస్టులకు అర్హుడైతే అన్ని ఐచ్ఛికాలు ఇచ్చేలా అవకాశం ఉంటుంది. ఆప్షన్స్ ఎంపిక సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
కొన్ని ఉదాహరణలు..