ముంబై: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ఒప్పో ‘ఫైండ్ ఎక్స్’ సిరీస్లో మరో రెండు కొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఫైండ్ ఎక్స్3 ప్రొ, ఫైండ్ ఎక్స్3 ఫోన్లను మార్చి 11న సాయంత్రం 5 గంటలకు ఆవిష్కరించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సరికొత్త మోడల్కు సంబంధించిన ఫీచర్లను వెల్లడించలేదు. 6.7 అంగుళాల ఓఎల్ఈడీ స్రీన్, 4,500 mAh బ్యాటరీ, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888 చిప్సెట్తో వస్తోన్న ఫైండ్ ఎక్స్3 ప్రొ 5జీని సపోర్ట్ చేస్తుంది.