న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్ఫోన్ మేకర్ ఒప్పో ఇటీవల ఒప్పో F19 ప్రొ, ఒప్పో F19 ప్రొ + ఫోన్లను భారత్లో విడుదల చేసింది. F19 సిరీస్లో కంపెనీ మూడో స్మార్ట్ఫోన్ ఒప్పో F19ను ఆవిష్కరించింది. 48 ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్, 5,000 mAh బ్యాటరీ, 33 W ఫ్లాష్ చార్జ్ టెక్నాలజీ, అమోలెడ్ FHD+ పంచ్ హోల్ డిస్ప్లే వంటి ప్రత్యేకతలు కొత్త ఫోన్లో ఉన్నాయి. F19 ప్రొ, F19 ప్రొ + ఫోన్ల ప్రారంభ ధర వరుసగా రూ.21,490, రూ.25,990గా ఉంది. ప్రిజమ్ బ్లాక్, మిడ్నైట్ బ్లూ కలర్లలో విడుదలైన F19 హ్యాండ్సెట్ ధర రూ.18,990గా నిర్ణయించారు.
ఎఫ్19 ప్రీ బుకింగ్స్ ప్రారంభంకాగా ఏప్రిల్ 9 నుంచి ఫ్లాష్సేల్ మొదలవనుంది. ఫ్లిప్కార్ట్, అమెజాన్ ద్వారా వీటిని కొనుగోలు చేయొచ్చు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ.1500 ఇన్స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది.