హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : బాలకార్మిక వ్యవస్థ, బాలల అక్రమ రవాణా నిర్మూలన కోసం రాష్ట్ర పోలీసులు చేపట్టిన ఆపరేషన్ ముసాన్-12లో రాష్ట్రవ్యాప్తంగా 6,307 మంది చిన్నారులను రక్షించామని సీఐడీ డీజీ చారుసిన్హా వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 124 సబ్ డివిజన్ పోలీసు బృందాల్లో 620 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, దేవాలయాలు, ఇటుక బట్టీలు, మెకానిక్ షాపులు, టీ దుకాణాల్లో ఎకువగా కనిపించే ప్రాంతాలను తనిఖీ చేసినట్టు పేర్కొన్నారు. 6,307 మంది చిన్నారుల్లో 5,892 మంది బాలురు, 415 మంది బాలికలు ఉన్నారని, వారిలో 3,447 మంది తెలంగాణకు చెందినవారు కాగా, 2,860 మంది ఇతర రాష్ట్రాలు, నేపాల్కు చెందినవారు ఉన్నట్టు తెలిపారు.