న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: అరుణాచల్ప్రదేశ్లో హిమపాతం కారణంగా ఏడుగురు జవాన్లు గల్లంతయ్యారు. రాష్ట్రంలోని కమెంగ్ సెక్టార్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకున్నది. జవాన్ల ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతున్నదని ఉన్నతాధికారులు వెల్లడించారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో హిమపాతం సంభవించిందని, అందులో వారు చిక్కుకుపోయారని సోమవారం తెలిపారు. రెస్క్యూ సిబ్బందికి సహాయంగా నిపుణుల బృందాన్ని కూడా పంపామని పేర్కొన్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో కొద్ది రోజులుగా మంచు కురుస్తున్నదని అధికారులు చెప్పారు.