న్యూఢిల్లీ : తన న్యూ మిడ్ రేంజ్ 5జీ ఫోన్ను నార్త్ అమెరికాలో వచ్చే నెలలో లాంఛ్ చేయనున్న వన్ప్లస్ లేటెస్ట్ ఫోన్ను భారత్లోనూ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేలా కంపెనీ సన్నాహాలు చేపట్టింది. వచ్చే నెలలో వన్ప్లస్ నార్డ్ ఎన్300 రానుందని కంపెనీ నిర్ధారించినా ఇంకా నిర్ధిష్ట తేదీని వెల్లడించలేదు.
భారత్ మార్కెట్లోనూ సందడి చేయనున్న వన్ప్లస్ నార్డ్ ఎన్300 మీడియాటెక్ చిప్సెట్ను కలిగిఉంటుంది. ఈ స్మార్ట్ఫోన్ 33డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగిఉంటుందని వన్ప్లస్ ఇప్పటికే నిర్ధారించింది. లేటెస్ట్ 5జీ ఫోన్తో పాటు ఫాస్ట్ చార్జర్ను కూడా వన్ప్లస్ అందిస్తుంది. ఈ డివైజ్ భారత్ మార్కెట్లో దాదాపు రూ 24,660కి అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు.
వన్ప్లస్ నార్డ్ ఎన్300ను భారత్లో మరో పేరుతో లాంఛ్ చేస్తారని టెక్ నిపుణులు ముకుల్ శర్మ వెల్లడించారు. భారత్లో 5జీ ఫోన్ అంతర్గత టెస్టింగ్ కూడా ప్రారంభమైందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. వన్ప్లస్ లేటెస్ట్ ఫోన్ 4జీబీ ర్యాం, 64జీబీ స్టోరేజ్ మోడల్తో ముందుకొస్తుందని చెబుతున్నారు. బ్లాక్, బ్లూ కలర్స్లో ఈ స్మార్ట్ఫోన్ ఆకట్టుకోనుందని సమాచారం. వన్ప్లస్ నార్డ్ లైట్ సిరీస్లో కంపెనీ ఈ మోడల్ను లాంఛ్ చేసే అవకాశం ఉంది.