న్యూఢిల్లీ : పండగ సీజన్ నేపధ్యంలో ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ సెప్టెంబర్ 23 నుంచి నిర్వహిస్తున్న లేటెస్ట్ సేల్ ఈవెంట్స్లో మొబైల్ ఫోన్లు సహా పలు ఉత్పత్తులపై హాట్ డీల్స్ వెల్లడించాయి. మరోవైపు వన్ప్లస్ మొబైల్ ఫోన్లపై అమెజాన్ సేల్లో ఆకర్షణీయ ఆఫర్లు అందుబాటులో ఉండగా మొబైల్ దిగ్గజం వన్ప్లస్ సైతం తన అధికారిక వెబ్సైట్పై సెప్టెంబర్ 22 నుంచి దివాళీ సేల్ను ప్రారంభిస్తోంది.
ఈ సేల్లో కంపెనీ వన్ప్లస్ 10 ప్రొను రూ 55,999కి విక్రయిస్తోంది. ఈ డివైజ్ను కంపెనీ గతంలో రూ 66,999కి లాంఛ్ చేయగా సేల్లో భాగంగా వన్ప్లస్ 10 ప్రొపై రూ 11,000 డిస్కౌంట్కు సేల్ చేస్తున్నారు. బ్యాంక్ కార్డులపై ఆఫర్తో పాటు డిస్కౌంట్లతో కలిపి ఈ మొత్తం తగ్గింపును కంపెనీ ఆఫర్ చేస్తోంది. మరోవైపు ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో లేటెస్ట్ స్మార్ట్ఫోన్ను మరింత తక్కువ ధరకు సొంతం చేసుకునే వెసులుబాటు ఉంది. వన్ప్లస్.ఇన్ వెబ్సైట్పై వన్ప్లస్ ఫోన్ డీల్స్ సెప్టెంబర్ 22 నుంచి అందుబాటులో ఉంటాయి.