లక్నో: ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన పోస్టల్ బ్యాలెట్లలో 51.5 శాతం ఓట్లు తమ కూటమికి పడ్డాయని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ స్పష్టం చేశారు. దీన్నిబట్టి చూస్తే ఎస్పీ కూటమికి దాదాపు 304 సీట్లు వచ్చినట్టు అని పేర్కొన్నారు. తమ కూటమికి ఓటేసిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగి, టీచర్కు పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. ఓటర్లను మోసం చేసి బీజేపీ గెలిచిందని ఆరోపించారు.