కరోనా మహమ్మారి వల్ల చాలామందిలో వ్యక్తిగత, కుటుంబ ఆరోగ్యంపై అవగాహన పెరిగిందనేది వాస్తవం. ఈ నేపథ్యంలోనే సామాన్యులు సైతం హెల్త్ ఇన్సూరెన్స్వైపు మొగ్గుచూపుతున్నారు. కొత్తగా అనేకమంది ఈ పాలసీలను తీసుకుంటున్నారు. ఆయా బీమా కంపెనీలూ కొవిడ్ 19కు అనుగుణంగా ప్రత్యేక ప్యాకేజీలతో కరోనా రక్షక్, కరోనా కవచ్ పేరిట పలు పాలసీలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. అయితే పాలసీ క్లెయిమ్కు వచ్చేసరికి తీవ్ర తాత్సారం చేస్తున్నాయి. దీనివల్ల పాలసీదారులు తమ జేబు నుంచి డబ్బులను చెల్లించుకోవాల్సి వస్తున్నది.
నిబంధనలు ఏం చెప్తున్నాయి?.. బీమా కంపెనీలు ఏ కారణం మేరకు క్లెయిమ్లను తిరస్కరిస్తున్నాయి?.. ఉద్దేశపూర్వకంగా క్లెయిమ్లను తిరస్కరిస్తే ఎవరిని ఆశ్రయించాలి?.. ఎలా ఫిర్యాదు చేయాలి?.. అనేది తెలియక పాలసీదారులు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. అయితే బీమా సంస్థల నుంచి పాలసీదారులకు, లేదంటే వారి క్లెయిమ్లకు సంబంధించి సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక అంబుడ్స్మన్ వ్యవస్థ ఉందనే విషయం చాలా మందికి తెలియలేదు.
బీమా చేసిన వ్యక్తులకు లేదా వారి వారసులకుబీమా సంస్థల నుంచి సాధారణంగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో బీమా చట్టం 1938ని అనుసరించి ‘ప్రజా సమస్యల పరిష్కార నియమావళి 1998’ చట్టాన్ని కేంద్రం రూపొందించింది. ఈ క్రమంలోనే బీమా లోక్పాల్ సంస్థ ఏర్పడగా, ఏటా నవంబర్11న బీమా లోక్పాల్ దినోత్సవాన్నీ నిర్వహిస్తున్నారు. ఈ చట్టం ప్రకారం పాలసీదారులకు పలు సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఇందులో అంబుడ్స్మన్ వ్యవస్థ కూడా ఉన్నది. దేశవ్యాప్తంగా మొత్తం 16 ప్రాదేశిక ప్రాంతాల్లో అంబుడ్స్మన్ కార్యాలయాలు ఉండగా, అందులో హైదరాబాద్ ఒకటి. ఇక ఈ బీమా లోక్పాల్ సంస్థ.. ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులను, పాలసీదారులను సమావేశపరిచి, ఇరువురి వాదనలను విని వివాదాన్ని పరిష్కరిస్తుంది.
ఇన్సూరెన్స్ అంబుడ్స్మన్ ఇచ్చిన ఆదేశాలను సదరు ఇన్సూరెన్స్ కంపెనీ 30 రోజుల్లో అమలు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా న్యాయం జరగకపోతే ఆపై సివిల్ కోర్టును ఆశ్రయించే అవకాశముంది. బీమా పాలసీదారులు పోస్ట్ ద్వారాగానీ, నేరుగాగానీ, లేదంటే bimalok pal.hydera bad @ecoi.inకు మెయిల్ ద్వారాగానీ ఫిర్యాదు చేయవచ్చు. ఇతర వివరాలకు www.ecoi. co.in వెబ్సైట్ను సందర్శించడంతోపాటు, 040-67504123/ 23325325 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు. మీకు ఇన్సూరెన్స్ కంపెనీకి మధ్య మధ్యవర్తిగా ఉండి, నిజానిజాలను పరిశీలించిన తర్వాత సమస్య పరిష్కారానికి బీమా లోక్పాల్ సిఫార్సులు ఇస్తుంది. ఈ సిఫార్సుకు అంగీకరిస్తే కంపెనీకి ఆదేశాలు జారీ చేస్తుంది.
ఎప్పుడు సంప్రదించాలి?
పీజీఐఎం గ్లోబల్ రియల్టీ ఫండ్
కొవిడ్ వ్యాప్తి చాలావరకు కట్టడి కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు కోలుకుంటున్నాయి. ఈ క్రమంలోనే రియల్ ఎస్టేట్ మళ్లీ పరుగులు పెడుతున్నది. దీంతో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు, ద్రవ్యోల్బణానికి హెడ్జింగ్గా, చిన్న మొత్తంలోనూ కొనుగోలు చేసే అవకాశాలను కల్పిస్తూ పీజీఐఎం ఇండియా.. గ్లోబల్ సెలక్ట్ రియల్ ఎస్టేట్ సెక్యూరిటీస్ ఫండ్ ఆఫ్ ఫండ్ను దేశీయ మార్కెట్కు తెచ్చింది. గత సోమవారం ప్రారంభమైన ఈ ఫండ్ ఎన్ఎఫ్వో 29న ముగుస్తుంది. ఈ ఓపెన్ ఎండెడ్ ఫండ్లో కనీస మదుపు రూ.5,000. 95 శాతం నిధులను ఐర్లాండ్లోని పీజీఐఎం గ్లోబల్ సెలక్ట్ రియల్ ఎస్టేట్ సెక్యూరిటీస్ ఫండ్లో మదుపు చేస్తారు. జీ-సెక్లు, కార్పొరేట్ డెట్, మనీ మార్కెట్ సాధానాల్లో మిగతా నిధులను మదుపు చేస్తారు.