హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది ఆయిల్ ఇయర్కి ఆయిల్పామ్ గెలల ధరను ప్రభుత్వం ఖరారు చేసింది. వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు మంగళవారం ఈ ధరపై ఉత్తర్వులు జారీచేశారు. తెలంగాణ ఆయిల్ఫెడ్ సాధించిన ముడి పామాయిల్ నుంచి సగటు నూనె రికవరీ శాతం 19.22 ఆధారంగా ధర ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి అదనంగా నూనెగింజ రికవరీ శాతం75.25ను జత చేయనున్నారు. ఇక ఈ ఏడాది నుంచి రవాణా చార్జీలను కూడా 30 శాతం పెంచడంతో అన్నీ కలిపి రైతుకు ఒక టన్నుకు రూ.700 నుంచి రూ.800 వరకు అదనంగా ఆదాయం సమకూరనున్నది.