ఉదయ్ కిరణ్ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు 21 ఏళ్ల తరువాత చిత్రం సీక్వెల్ చిత్రం 1.1 పేరుతో రూపొందనుందంటూ దర్శకుడు తేజ ఈ మధ్య అఫీషియల్గా ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఇందులో హీరోగా ఎవరు నటిస్తారనే ఆసక్తి అందరిలో ఉంది. తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ చంద్ర హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది.
తేజ దగ్గరే యాక్టింగ్కు సంబంధించి ఓనమాలు నేర్చుకున్న నితిన్ ఇప్పుడు చిత్రం 1.1 పేరుతో ప్రేక్షకులని పలకరించనున్నట్టు తెలుస్తుంది. ఏప్రిల్ 18న మూవీ లాంచ్ కార్యక్రమం జరగనుండగా, ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్, పలువురు సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నట్టు తెలుస్తుంది. కాగా 2000 సంవత్సరంలో ఉదయ్ కిరణ్, రీమాసేన్ ప్రధాన పాత్రలలో చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. సీక్వెల్ కోసం 40 మంది కొత్త నటీనటులని ఎంపిక చేసిసినట్టు తెలుస్తుంది.