దర్శకుడు కొరటాల శివతో ఎన్టీఆర్ ఓ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ పెట్టుకున్నారు. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అయితే రెగ్యులర్ చిత్రీకరణ ఎప్పుడనేది ఇంకా తేలలేదు. తాజా సమాచారం ప్రకారం మరింత బలమైన స్క్రిప్ట్ను ఈ సినిమా కోసం దర్శకుడు కొరటాల సిద్ధం చేస్తున్నారని, ఈ స్క్రిప్ట్ ఫైనల్ వెర్షన్ లాక్ చేసే పనిలో ఉన్నారని తెలుస్తున్నది. అందుకే సెప్టెంబర్లో సెట్స్ మీదకు వెళ్లాల్సిన ఈ సినిమా మరికాస్త ఆలస్యంగా అక్టోబర్లో వెళ్లనుందట. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్గా కనిపిస్తాడని రూమర్స్ వస్తున్నాయి. ముందు ఈ చిత్రంలో నాయికగా ఆలియా భట్ను అనుకున్నా..ప్రెగ్నెన్సీ వల్ల ఆమె ఈ చిత్రంలో నటించే అవకాశాలు కనిపించడం లేదు. జాన్వీ కపూర్ను నాయికగా తీసుకుంటున్నారనే ప్రచారమూ జరుగుతున్నది. ఏదేమైనా ఈ సినిమా గురించిన అఫీషియల్ అప్డేట్ మూవీ యూనిట్నుంచి రావాల్సిఉంది.