న్యూఢిల్లీ: మధుమేహ రోగుల్లో రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించే 12 యాంటీ-డయాబెటిక్ జనరిక్ మెడిసిన్స్ గరిష్ఠ ధరలను ఖరారు చేసినట్టు ఔషధ ధరల నియంత్రణ మండలి నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) సోమవారం తెలిపింది. ైగ్ల్రెమ్పిరైడ్ ట్యాబ్లెట్లు, గ్లూకోజ్ ఇంజెక్షన్లు ఈ జాబితాలో ఉన్నట్టు పేర్కొంది. మధుమేహంతో బాధపడుతున్న ప్రతీ భారతీయుడికి అందుబాటు ధరల్లో ఔషధాలు అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.