హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): నేషనల్ సెంటర్ ఫర్ అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ (3డీ ప్రింటింగ్) కేంద్రానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్ జారీచేసింది. పదేండ్ల అనుభవం, ఇంజినీరింగ్స్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్డీ, అదనంగా ఎంబీఏ డిగ్రీ కలిగిన అభ్యర్థులు అర్హులు. తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్పర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ఏర్పాటుచేసిన ఈ సంస్థ కార్యకలాపాలను హైదరాబాద్ నుంచి నిర్వహించనున్నారు.