Gutka Ad | హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): గుట్కా కంపెనీల ప్రకటనల్లో నటించిన బాలీవుడ్ నటులు అక్షయ్ కు మార్, షారూక్ ఖాన్, అజయ్ దేవ్గణ్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా అలహాబాద్ హైకోర్టు లక్నో ధర్మాసనానికి తెలిపింది. 2022, సెప్టెంబరులో కేంద్రానికి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు కాలేదని పేర్కొంటూ దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్పై విచారణ సందర్భంగా డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎస్బీ పాండే ఈ సమాచారాన్ని న్యాయస్థానానికి తెలిపారు.
వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే ఏడాది మే 9కి వాయిదా వేసింది. అత్యున్నత స్థాయి పురస్కారాలను పొందిన నటులు, వివిధ హోదాలు కలవారు గుట్కా కోసం వ్యాపార ప్రకటనల్లో పాల్గొంటున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ గతంలో కోరారు.