జోగులాంబ గద్వాల : అలంపూర్ క్షేత్రంలోని జోగులాంబ, బాలబ్రహేంద్ర స్వామి ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేలాదిగా భక్తులు తరలివచ్చి జోగులాంబ అమ్మవారిని దర్శిచుకున్నారు. గురువారం సుమారుగా 15,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. 300 వరకు స్వామివారికి అభిషేకాలు జరిగాయని ఆలయ వర్గాలు తెలిపాయి. అలాగే మాజీ ఎంపీ మంద జగన్నాథం, గద్వాల్ డీఎస్పీ యాదగిరి తదితరులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.