ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బహుమతి నోబెల్ ప్రైజ్. ప్రపంచ మానవాళికి ఉపయోగపడే పరిశోధనల్లో సఫలీకృతులైనవారినే ఈ బహుమతి వరిస్తుంది. భౌతిక, రసాయన, వైద్య, ఆర్థిక, శాంతి, సాహిత్యం వంటివాటిలో చేసిన కృషికిగాను ఆల్ఫ్రెడ్ బెర్న్హార్డ్ నోబెల్ పేరుమీద ఈ ప్రైజ్ను అందిస్తున్నారు. ప్రతి ఏటా నోబెల్ వర్ధంతి అయిన డిసెంబర్ 10న వీటిని ప్రదానం చేస్తారు. ఈ సందర్భంగా ఈ ఏడాది నోబెల్కు ఎంపికైన వారి గురించి మరొకసారి ప్రత్యేకంగా తెలుసుకుందాం.
వైద్యశాస్త్రం
కెమిస్ట్రీ
ఫిజిక్స్లో
ఆర్థిక శాస్త్రం
సాహిత్యం
శాంతి
భారత నోబెల్ గ్రహీతలు
భారతీయులు గాని, భారత సంతతికి చెందినవారు గాని, భారత పౌరసత్వం స్వీకరించినవారు గాని నోబెల్ బహుమతిని అందుకున్నవారు.
1) రవీంద్రనాథ్ ఠాగూర్
పశ్చిమ బెంగాల్కు చెందిన ఠాగూర్ 1913లో సాహిత్యంలో నోబెల్ను అందుకున్నారు. నోబెల్ను అందుకున్న మొదటి భారతీయుడు ఠాగూర్. బ్రిటన్ పరిపాలనలో భారతదేశం ఉన్నప్పుడు ఠాగూర్కు ఈ బహుమతి లభించింది. ఇతను రచించిన గీతాంజలి (సాంగ్ ఆఫ్ రింగ్స్)కి ఈ బహుమతి దక్కింది.
2) సీవీ రామన్
తమిళనాడుకు చెందిన సీవీ రామన్ ఫిజిక్స్లో 1930లో నోబెల్ను అందుకున్నారు. కాంతి ప్రయాణంలో ఒక అణువు వద్ద పోటాన్లు ఎంతగా పరివ్యాప్తమవుతాయన్న దానిని బట్టి ఆయా పదార్థాల ధర్మాలను గ్రహించవచ్చని ప్రతిపాదించారు. వీటిని రామన్ ఎఫెక్ట్గా పిలుస్తారు. ఇతను భారత్ నుంచి నోబెల్ అందుకున్న రెండో వ్యక్తి. రామన్ ఎఫెక్ట్ను ప్రతిపాదించిన రోజు ఫిబ్రవరి 28ని భారతదేశంలో నేషనల్ సైన్స్ డేగా నిర్వహిస్తున్నారు.
3) హర్గోబింద్ ఖొరానా
ఖొరానా 1922, జనవరి 9న కోల్కతాలో జన్మించారు. అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. జన్యువుల ఆవిష్కారమే అమోఘమనుకుంటే ఆ జన్యువుల్లో జీవ సంకేతాలు ఏ క్రమంలో ఎలా ఉంటున్నాయో విశ్లేషించి చూపడం, కీలకమైన ప్రొటీన్ సమ్మేళనాలు వాటి పాత్ర ఏమిటో గుర్తించినందుకు వైద్యశాస్త్రంలో 1968లో నోబెల్ లభించింది.
4) మదర్ థెరిసా
అల్బేనియా (మాసిడోనియా)లో పుట్టి భారత్లో స్థిరపడింది. పేదలు, రోగులకు సేవచేయడానికి తన జీవితాన్ని అంకితం చేసింది. మిషనరీస్ ఆఫ్ చారిటీ ఏర్పాటు చేసి మానవాళికి సేవ చేసినందుకు 1979లో ఆమెకు నోబెల్ శాంతి బహుమతి లభించింది.
5) సుబ్రమణియం చంద్రశేఖర్
1910, అక్టోబర్ 19న అవిభాజ్య భారత్లోని లాహోర్ (ప్రస్తుతం పాకిస్థాన్)లో జన్మించారు. అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. ఇతను సీవీ రామన్ సోదరుడి కుమారుడు. నక్షత్రాల పుట్టుక, పరిణామాలపై సరికొత్త కాంతిని ప్రసరింపజేసినందుకు ఫిజిక్స్ నోబెల్ బహుమతి 1983లో లభించింది. ఇతను ‘చంద్రశేఖర్ లిమిట్’ పేరుతో ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.
6) అమర్త్యసేన్
1933, నవంబర్ 3న పశ్చిమ బెంగాల్లో జన్మించారు. సంప్రదాయ అర్థశాస్త్రం విస్మరిస్తూ వచ్చిన జన సంక్షేమ ఆర్థిక శాస్త్రంంపై చేసిన కృషికి గాను ఎకనామిక్స్లో నోబెల్ బహుమతి 1998లో లభించింది. ఆర్థిక సంస్కరణలకు ముందు విద్య, వైద్యం, ఆహార లభ్యత వంటివి సంస్కరించినప్పుడే నిజమైన పురోభివృద్ధి సాధ్యమని నొక్కి చెప్పారు.
7) వెంకటరామన్ రామకృష్ణన్
1952లో తమిళనాడులోని చిదంబరంలో జన్మించారు. ఈయన జీవరసాయన శాస్త్రజ్ఞుడు. ఈయనకు కెమిస్ట్రీలో నోబెల్ 2009లో లభించింది. మానవ శరీరం యావత్తు కణ నిర్మితం. ప్రతి కణంలోనూ కేంద్రకం, అందులో మన శారీరక గమనాన్ని నిర్దేశించే సంకేతం డీఎన్ఏపై విశేష కృషి చేశారు. ఆర్ఎన్ఏ స్ట్రక్చరల్ రైబోజోమ్పై పరిశోధనలు చేశారు.
8) కైలాష్ సత్యార్థి
ఇతను 1954, జనవరి 11న మధ్యప్రదేశ్లోని విదిశలో జన్మించారు. ‘బచ్పన్ బచావో ఆందోళన్’ సంస్థను స్థాపించి బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు. పిల్లల హక్కులను పొందడానికి కృషిచేశారు. దాదాపు లక్ష మంది పిల్లలను బాల కార్మికులు, అక్రమ రవాణా, బానిసత్వం నుంచి విముక్తి కలిగించారు. ఇందుకు గాను నోబెల్ శాంతి బహుమతిని 2014లో మలాలా యూసఫ్జాయ్తో కలిసి సంయుక్తంగా అందుకున్నారు.
9) అభిజిత్ బెనర్జీ
కోల్కతాలో జన్మించిన ఈయన భారత్ నుంచి అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఇతనికి 2019లో ఆర్థిక శాస్త్రంలో మరో ఇద్దరికి కలిపి నోబెల్ లభించింది. అభిజిత్ బెనర్జీతో పాటు ఆయన భార్య ఎస్తర్ డఫ్లో, మైఖేల్ క్రెమెర్లకు సంయుక్తంగా లభించింది. అంతర్జాతీయంగా పేదరికాన్ని ఎదుర్కొనే అంశంలో పరిష్కారాలు చూపినందుకు వీరికి నోబెల్ దక్కింది.
1907లో సాహిత్యంలో నోబెల్ను అందుకున్న ప్రముఖ బ్రిటన్ రచయిత రుడ్యార్డ్ కిప్లింగ్ 1865లో ముంబయిలో జన్మించాడు. ఇతని ప్రముఖ రచన ‘ది జంగిల్ బుక్.
మలేరియాపై సికింద్రాబాద్లో పరిశోధనలు చేసిన బ్రిటన్ పౌరుడు రొనాల్డ్ రాస్ 1857, మే 13న ఉత్తరాఖండ్లోని అల్మోరాలో జన్మించారు. ఈయన వైద్యశాస్త్రంలో 1902లో నోబెల్ను అందుకున్నారు.