శామీర్పేట : సీఎం కేసీఆర్ (CM KCR) నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధిని ఎవరూ ఆపలేరని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ( Minister Mallareddy) అన్నారు. మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు గురువారం బీఆర్ఎస్ (BRS ) లో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మంత్రి మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అడుగడుగునా అభివృద్ధికి అడ్డం పడుతూనే ఉన్నారని ఆరోపించారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక పోతున్నారని దుయ్యబట్టారు.పేదలకు ఆసరా పింఛన్, కల్యాణలక్ష్మి, నిరంతర విద్యుత్, త్రాగునీరు, సాగునీరు, మిషన్ భగీరథ, రైతుబంధు (Raitu Bandu), రైతుబీమా, గృహలక్ష్మి వంటి ఎన్నో పథకాలు ఉపయోగ పడుతున్నాయని పేర్కొన్నారు.
అభివృద్ధిని చూసి కాంగ్రెస్, బీజేపీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చామకూర మహేందర్రెడ్డి, ఎంపీటీసీ నాగరాజు, బీఆర్ఎస్ నేతలు మురళిగౌడ్, మంద స్వామిముదిరాజ్, బుచ్చిరెడ్డి, చంద్రకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పార్టీలో చేరికలు
ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకుని అండర్గ్రౌండ్ డ్రైనేజీలు, సీసీ రోడ్లు, కుల సంఘాలు, దేవాలయాల నిర్మాణంతో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయడంతో తామంతా సీఎంకు అండగా ఉండేందుకు బీఆర్ఎస్లో చేరినట్లు కాంగ్రెస్, బీజేపీ పార్టీ నాయకులు అంగడి గురునాథ్, చక్రపాణి, అర్జున్, బాలేష్, కరుణాకర్, సాయికుమార్, ముత్యాలు, పాండు, సాయి, భాస్కర్ తెలిపారు.