వేల్పూర్,అక్టోబర్ 28 : నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని అంక్సాపూర్-కుకునూర్ గ్రామాల శివారులో గూడ్స్ రైలు ఢీకొని 50 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. గ్రామానికి చెందిన భోజన్న, ఆయన కుమారుడు చిన్న బోజేందర్కు చెందిన రెండు వందల గొర్రెలను గురువారం మేపడానికి గ్రామ శివారులోకి తీసుకెళ్లారు. గొర్రెలు మేస్తూ సమీపంలోని పట్టాలపైకి వచ్చాయి. అప్పుడే కరీంనగర్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న గూడ్స్ రైలు ఢీకొట్టింది. దీంతో 50 గొర్రెలు మృత్యువాత పడగా 9 గాయపడ్డాయి. చనిపోయిన గొర్రెల విలువ సుమారు రూ.5లక్షల వరకు ఉంటుందని బాధితులు తెలిపారు.