న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: హిజాబ్ వివాదం చిన్న అంశం అని, అయితే ఇలాంటి వివాదాలు సమాజానికి అంత మంచిది కాదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. అన్ని మతాలను అందరు ప్రజలు గౌరవించాలన్నారు. ‘కొంత మంది మసీదుకు వెళ్తారు. కొంత మంది గుడికి వెళ్తారు. కొంత మంది గురుద్వారాకు వెళ్తారు. మనందరం సమాజంలో భాగం. ప్రతీ ఒక్కరు అన్ని మతాలను గౌరవించాలి. మత సామరస్యాన్ని కాపాడాలి’ అని గడ్కరీ అన్నారు.