జామ్నగర్: నీతా అంబానీ(Nita Ambani) తన డ్రెస్సింగ్ స్టయిల్తో అందర్నీ అట్రాక్ట్ చేస్తుంది. జామ్నగర్లో తన కుమారుడి ప్రీ వెడ్డింగ్ వేడుక సజావుగా సాగేందుకు సహకరించిన జామ్నగర్ రిలయన్స్ కుటుంబానికి ఆమె పార్టీ ఇచ్చారు. ఆ డిన్నర్ పార్టీలో నీతా అంబానీ స్పెషల్ శారీలో కనిపించారు. ఎరుపు రంగు కంచిపట్టు చీరను ఆమె ధరించింది. స్వదేశ్ ష్యాషన్ కంపెనీ దాన్ని డిజైన్ చేసింది. చేనేత కార్మికులే ఈ చీరను డిజైన్ చేశారు. ఆ చీరపై అనంత్, రాధిక మొదటి అక్షరాలు ఉన్నాయి. చీరలో డిజైన్లు అందంగా ఉన్నాయి. ఆలయాలు, పవిత్ర స్థలాలు, నిర్మాణాలు ఉట్టిపడేలా ఆ చీరను డిజైన్ చేశారు. ఆ చీరలో సుమారు 102 కంచీపురం సిల్క్ శారీ ప్యాటర్న్ ఉన్నట్లు భావిస్తున్నారు. సెమీ స్లీవ్ బ్లౌజ్ వేసుకుందామె. ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చాలా సున్నితంగా ఉంది. ఎరుపు కలర్ బిందీ పెట్టిన ఆమె తన లుక్స్తో హుందాగా కనిపించారు. తన మెడలో వేసుకున్న జ్వలరీతో నీతా అంబానీ మరింత మెరిసిపోయింది.
Draped in love ~ Etched with the initials of her beloved Anant and Radhika, Mrs Nita Ambani dons the world-famous handloom kanchipuram saree designed by Swadesh, handcrafted by Artisans.
She was seen thanking the Jamnagar Reliance Parivar for thier Love and Support during Anant… pic.twitter.com/FmDFbDR4Pq— Pankaj Upadhyay (@pankaju17) March 7, 2024