బెల్గ్రేడ్: పురుషుల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో నిశాంత్దేవ్, సంజీత్ క్వార్టర్స్లోకి దూసుకెళ్లారు. సోమవారం జరిగిన 71కిలోల ప్రిక్వార్టర్స్ బౌట్లో నిశాంత్ 3-2 తేడాతో మార్కో అల్వారెజ్ వెర్డెపై అద్భుత విజయం సాధించాడు. ఆది నుంచే దూకుడు కనబరిచిన నిశాంత్.. ప్రత్యర్థిపై పదునైన పంచ్లతో విరుచుకుపడ్డాడు. క్వార్టర్స్లో రష్యాకు చెందిన వాదిమ్ మసయేవ్(రష్యా)తో నిశాంత్ తలపడుతాడు. 92కిలోల బౌట్లో సంజీత్ 4-1తో గియోర్గిపై అలవోక విజయాన్నందుకుని అజిజ్ అబ్బెస్(ఇటలీ) తో పోరుకు సిద్ధమయ్యాడు. మరోవైపు రోహిత్ మోర్(57కి), అకాశ్ సాంగ్వాన్ (67కి), సుమిత్ కుందు (75కి), దీపక్ ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు. ఇప్పటికే మెగాటోర్నీలో స్టార్ బాక్సర్ శివ థాపా క్వార్టర్స్ బెర్తు దక్కించుకున్న సంగతి తెలిసిందే.