కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర సర్కారు ఆదేశాలు
ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగప్రదేశాల్లో తప్పనిసరంటూ ఉత్తర్వులు
పండుగలకు అనుమతి నిషేధిస్తూ నిర్ణయం
ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
మంచిర్యాల, మార్చి 28, నమస్తే తెలంగాణ : రాష్ట్రంతో పా టు జిల్లాలోనూ కొద్ది రోజులుగా కరోనా కేసుల సంఖ్య క్ర మంగా పెరుగుతున్నది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందనో, అంతగా ప్రభావం చూపడం లేదనో కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. సెకండ్వేవ్ రోజురోజుకూ విజృంభిస్తూ పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. పని, బహిరంగ ప్రదేశా లు, ప్రజా రవాణా వాహనాల్లో మాస్కుల వినియోగం త ప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నది. మాస్కులు ధరించ ని వారిపై విపత్తు నిర్వహణ చట్టం, ఐపీసీ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ర్యాలీలు, ఒకేచోట ప్రజలు గుంపులుగా ఉండడంపై ఆంక్షలు విధించింది. ఈ నెల 30 వరకు ఎలాంటి ర్యాలీలు, ఉత్సవాలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాలు, స్థలాలు, పా ర్కుల్లో ఎలాంటి సమావేశాలు నిర్వహించరాదని సూ చించింది. హోలీ, ఉగాది, శ్రీరామనవమి, మహావీర్ జయం తి, గుడ్ఫ్రైడే, రంజాన్ తదితర పండుగల సందర్భాల్లో ఎలాంటి మతపరమైన కార్యక్రమాలను నిర్వహించరాదని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నిబంధనలు విధిగా అమలయ్యే లా చూడాలని కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
జిల్లాలో పెరుగుతున్న కేసుల సంఖ్య..
జిల్లాలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈనెల 20న 30 మందికి, 21న 38, 22న 31, 23న 41 మందికి పాజిటివ్ రాగా, 24న ఏకంగా ఆ సంఖ్య 47గా నమోదైంది. 25న 40, 26న 36, 27న 35 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ప్రజల్లో ఆందోళన నెలకొన్నది. ఆర్థిక ఇబ్బందులరీత్యా, లాక్డౌన్ విధించబోమని, నిబంధనలు కఠినతరం చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తం గా ఉండాలని, కరోనా కట్టడికి సహకరించాలని కోరారు. మాస్కులు తప్పనిసరిగా ధరించడంతో పాటు, భౌతిక దూ రం పాటించాలని విజ్ఞప్తి చేసింది. ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. జాగ్రత్త చర్యల్లో భాగంగానే పాఠశాలలకు తాత్కాలికంగా సెలవులు ఇచ్చారు. జిల్లాలోని వసతిగృహాలు, కళాశాలలు, పాఠశాలల్లో కరోనా కేసు లు పెరగడం, పలువురికి పాజిటివ్ నిర్ధారణ కావడంతో ప్ర భుత్వం తీవ్రంగా పరిణమించింది. సామూహికంగా ఉండడంతో కేసులు పెరుగుతున్నాయని, పాఠశాలలు, హాస్టళ్లు మూసివేయాలని తల్లిదండ్రులు, విద్యార్థులు విన్నవించగా తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు కొనసాగుతాయని, పాఠశాలలకు రావద్దని విద్యాశాఖ అధికారులు సూచించారు.