న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు ఘటన ప్రధాన సూత్రధారితో సహా ఇద్దరు నిందితులను ఎన్ఐఏ అధికారులు శుక్రవారం పశ్చిమబెంగాల్లో అరెస్టు చేశారు. నిందితులు ముస్సావిర్ హుస్సేన్ సాజిబ్, అబ్దుల్ మథీన్ అహ్మద్ తాహా కోల్కతా సమీపంలో తప్పుడు గుర్తింపులతో దాక్కొని ఉండగా.. వారిని ఎన్ఐఏ బృందం గుర్తించిందని అధికారులు తెలిపారు. సాజిబ్ అనే వ్యక్తి కేఫ్లో ఐఈడీ పేలుడు పదార్థాన్ని అమర్చగా, ఈ ప్లాన్కు మాస్టర్ మైండ్ అబ్దుల్ మథీన్ అని పేర్కొన్నారు. ఎన్ఐఏ, కేంద్ర నిఘా సంస్థలు, పశ్చిమబెంగాల్, తెలంగాణ, కర్ణాటక, కేరళ పోలీసుల మధ్య సమన్వయంతో ఈ ఆపరేషన్ జరిగిందని తెలిపారు. గత నెల 1న రామేశ్వరం కేఫ్లో చోటుచేసుకొన్న పేలుడు ఘటనలో పలువురికి గాయాలైన విషయం తెలిసిందే.