ఆరు జట్లతో నిర్వహణకు ఐపీఎల్ కౌన్సిల్ మొగ్గు?
ముంబై: వచ్చే ఏడాది మహిళల ఐపీఎల్ అలరించబోతున్నది. పురుషుల మాదిరిగా మహిళల క్రికెట్ ఐపీఎల్కు బీసీసీఐ అంగీకారం తెలిపింది. ఐదు లేదా ఆరు జట్ల కలయికతో లీగ్ మొదలుపెట్టనుంది. బోర్డు ఏజీఎమ్ ఆమోదం తెలిపితే వచ్చే ఏడాది తొలిసీజన్ షురూ అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. శుక్రవారం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో చర్చ జరిగింది. భేటీ అనంతరం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ ‘మహిళల ఐపీఎఎల్ లీగ్కు ఏజీఎమ్ ఆమోదం పొందాల్సి ఉంది. వచ్చే ఏడాది లీగ్ మొదలవుతుందన్న నమ్మకముంది’ అని అన్నాడు. ఇదిలా ఉంటే ఐపీఎల్ జరుగుతున్న సమయంలో నాలుగు మహిళల టీ20 ఎగ్జిబిషన్ మ్యాచ్లను నిర్వహించనుంది. ఈ విషయాన్ని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ పేర్కొన్నారు.