న్యాల్కల్, డిసెంబర్ 31: నూతన సంవత్సరానికి ముందస్తుగా విద్యార్థులు స్వాగతం పలికారు. శుక్రవారం మామిడ్గి ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులందరూ 2022 అక్షరాల రూపంలో కూర్చొని కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. పాఠశాల విద్యార్థుల చేపట్టిన ప్రదర్శన ఎంతోగానో ఆకట్టుకుంది.ఖలీల్పూర్ శ్రీవినాయక మాడల్ పాఠశాలలో ముం దస్తు న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు..
రామచంద్రాపురం, డిసెంబర్31: కొత్త జోష్లో ప్రజలు న్యూ ఇయర్కి స్వాగతం పలికారు. వ్యాపారులు, ఈవెంట్ మేనేజర్లు న్యూ ఇయర్ ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షించారు. ప్రజలు కూడా న్యూ ఇయర్ వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. బేకరీలు, బార్లు, రెస్టారెంట్లు వినియోగదారులతో కిటకిటలాడాయి.
కొత్త ఏడాది సంబురం
వట్పల్లి, డిసెంబర్ 31 : నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని గ్రామాల్లో పండుగా వాతావరణం నెలకొన్నది. పాఠశాలలో చిన్నారులు కేకులు కట్ చేసి పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. 2021 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు.
గుమ్మడిదల మండలంలో
గుమ్మడిదల, డిసెంబర్ 31 : మండలంలో 2022 నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. బేకరీ దుకాణాల్లో కేకుల అమ్మకాలు జోరందుకున్నాయి. అటు మద్యం అమ్మకాలు సైతం జోరుగా ఉపందుకున్నాయి. చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతిఒక్కరూ కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొని సంబురాలు చేసుకున్నారు. స్నేహితులు, బంధువులకు సోషల్ మీడియా ద్వారా గ్రీటింగ్స్ అందిస్తూ సంతోషాలను పంచుకుంటున్నారు.
న్యూ ఇయర్కు ఏర్పాట్లు
కంగ్టి, డిసెంబర్ 31: నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు యువత ఏర్పాట్లు చేసుకుంటున్నది. ఇందులో భాగంగా వారు కేక్లు కట్చేసి శుక్రవారం అర్ధరాత్రి సంబురాలు జరుపుకొన్నారు.
బొల్లారంలో
బొల్లారం, డిసెంబర్ 31 : ఒకరోజు ముందుగానే నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. బొల్లారం పబ్లిక్ పాఠశాలలో నిర్వహించిన వేడుకల్లో టీఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకుడు చంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.