చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకుడు. రామ్చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. నిరంజన్ రెడ్డి నిర్మాత. ఫిబ్రవరి 4న ప్రేక్షకులముందుకురానుంది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ చిత్రంలోని రెండో గీతాన్ని విడుదల చేశారు. ‘నీలాంబరి..వేరెవ్వరే నీలామరి..అయ్యోరింటి సుందరి..వయ్యారాల వల్లరి నీలాంబరి’ అంటూ సాగే ఈ గీతం ప్రేయసీప్రియుల వలపు భావనలకు అద్దం పట్టింది. అనంత్శ్రీరామ్ రచించిన ఈ పాటను రమ్య బెహరా, అనురాగ్కులకర్ణి ఆలపించారు. ఈ పాటలో రామ్చరణ్, పూజాహెగ్డేల మధ్య కెమిస్ట్రీ అందరిని ఆకట్టుకుంటుందని చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాలో ఆచార్యుడిగా, నక్సలైట్గా రెండు భిన్న కోణాలున్న పాత్రలో చిరంజీవి కనిపించనున్నారని సమాచారం. సిద్ధ అనే శక్తివంతమైన పాత్రను రామ్చరణ్ పోషిస్తున్నారు. ధర్మస్థలి కేంద్రంగా నడిచే ఈ కథలో సామాజికాంశాల చర్చ ఉంటుందని చెబుతున్నారు. కాజల్ అగర్వాల్, పూజాహెగ్డే కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎస్.తిరుణ్ణావుక్కరసు, సంగీతం: మణిశర్మ, నిర్మాణ సంస్థలు: కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, రచన-దర్శకత్వం: కొరటాల శివ.