యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. విజయ్ కుమార్ కలివరపు దర్శకుడు. శ్రీమతి విజయలక్ష్మి సమర్పణలో బలగ ప్రకాష్ నిర్మించారు. మే 6న విడుదల కానుంది. ఈ సినిమాలోని ‘గొలుసుకట్టు ఘోషలు’ లిరికల్ పాటను సోమవారం చిత్రబృందం విడుదల చేశారు. హృద్యంగా సాగిన ఈ పాటకు కీరవాణి సంగీతాన్ని అందించడంతో పాటు చారు హరిహరన్తో కలిసి ఆలపించారు. చైతన్య ప్రసాద్ సాహిత్యాన్ని అందించారు. జయమ్మ పాత్రకు ఎదురయ్యే కష్టాలను, ఆ పాత్రలోని భావోద్వేగాలను ఈ పాట ఆవిష్కరించింది. ఇటీవలే పవన్ కళ్యాణ్ విడుదల చేసిన ట్రైలర్కు మంచి స్పందన వస్తున్నదని.. సినిమా కూ ఇదే ఆదరణ ఆశిస్తున్నట్లు దర్శకనిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి ఎడిటర్ – రవితేజ గిరిజాల, సినిమాటోగ్రఫీ : అనూష్కుమార్.