‘భలే భలే బంజారా…’ పాట నాకెంతో ప్రత్యేకమైంది. ఈ పాటలో రామ్ చరణ్తో కలిసి స్టెప్పులు వేయడం సంతోషంగా ఉంది. నా గ్రేస్తో చరణ్ను డామినేట్ చేశానేమో అనిపిస్తున్నది’ అని అన్నారు హీరో చిరంజీవి. రామ్ చరణ్తో కలిసి ఆయన నటించిన ‘ఆచార్య’ చిత్రం నుంచి ‘భలే భలే బంజారా.., సిరుత పులుల సిందాట’ లిరికల్ గీతాన్ని విడుదల చేశారు. ఈ పాటలో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి వేసిన డ్యాన్స్ స్టెప్పులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా…మణిశర్మ స్వరపర్చారు. శంకర్ మహదేవన్, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీతో కలిసి మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్నది. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మాతలు. కొరటాల శివ దర్శకత్వం వహించారు. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే నాయికలుగా కనిపించనున్నారు. తుది హంగులు అద్దుకుంటున్న ‘ఆచార్య’ ఈనెల 29న విడుదలకు సిద్ధమవుతున్నది.