Dinesh Tripathi : భారత నావికాదళం చీఫ్ (Indian Navy Chief) గా బాధ్యతలు చేపట్టడానికి ముందు అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి తన తల్లి రజ్నీ త్రిపాఠి పాదాలకు నమస్కరించారు. కొడుకు తన పాదాలను తాకగానే లేచి నిలబడిన తల్లి.. దినేశ్ త్రిపాఠిని ఆత్మీయ ఆలింగనం చేసుకుని వీపుపై తట్టారు. ఈ వినమ్ర దృశ్యం అందరి హృదయాలను తాకింది. ఈ అపూర్వ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. కింది వీడియోలో ఆ దృశ్యాలను మీరు కూడా వీక్షించవచ్చు.
#WATCH | Delhi: Navy Chief Admiral Dinesh Tripathi seeks blessings from his mother Rajni Tripathi ahead of taking charge as the new Indian Navy chief. pic.twitter.com/mNo8EC8iQS
— ANI (@ANI) April 30, 2024
అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి ఇవాళ ఇండియన్ నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని సౌత్ బ్లాక్లో ఈ బాధ్యతల స్వీకార కార్యక్రమం జరిగింది. ఇప్పటిదాకా నేవీ చీఫ్గా ఉన్న హరికుమార్ పదవీ విరమణ చేయడంతో.. ఆయనతో నూతన నేవీ చీఫ్గా దినేశ్ త్రిపాఠి బాధ్యతలు చేపట్టారు. ఇండియన్ నేవీ అన్ని విధాలం పటిష్టంగా ఉన్నదని ఈ సందర్భంగా త్రిపాఠి అన్నారు. అందివస్తున్న నూతన సాంకేతికతలను వినియోగించుకుని నేవీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ఆయన చెప్పారు.
కాగా అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి ఇప్పటి వరకు ఇండియన్ నేవీలో ‘వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్’గా బాధ్యతలు నిర్వహించారు. దినేశ్ త్రిపాఠి 1964 మే 15న జన్మించారు. రేవా సైనిక్ స్కూల్లో ఆయన విద్యాభ్యాసం జరిగింది. 1985 జూలై 1న ఇండియన్ నేవీకి చెందిన ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లో చేరారు. కమాండింగ్ ఇన్ చీఫ్ ఆఫ్ ది వెస్టర్న్ నేవల్ కమాండ్లో ఆయన ఫ్లాగ్ ఆఫీసర్గా విధులు నిర్వహించారు. వినాశ్, కిర్క్, త్రిశూల్ లాంటి భారత నేవీ నౌకలపై ఆయనకు కమాండింగ్ ఉంది. నేవీకి అందించిన సేవలకు గుర్తింపుగా దినేశ్ త్రిపాఠిని అతి విశిష్ఠ్ సేవా మెడల్ (AVSM), నౌ సేనా మెడల్ (NM) వరించాయి.