హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం 25,900 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 134 పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్యారోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తాజాగా 201 మంది కొవిడ్ నుంచి కోలుకొన్నారు. ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం 3,693 మంది ఐసొలేషన్లో చికిత్స పొందుతున్నట్టు వైద్యాధికారులు వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చిన 532 మందికి శంషాబాద్ విమానాశ్రయంలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా, ఒకరికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఒమిక్రాన్ అవునో కాదో నిర్ధారించేందుకు నమూనాలను జీనోమ్ సీక్వెన్స్కు పంపించారు.