వాషింగ్టన్, నవంబర్ 5: ఒక్క రక్త నమూనాతో 50కి పైగా క్యాన్సర్లను గుర్తించే టెస్టును అమెరికాకు చెందిన గ్రెయిల్ కంపెనీ అభివృద్ధి చేసింది. ‘గల్లేరీ’ పేరిట చేసే ఈ టెస్టుతో క్లోమం, అండాశయం వంటి అత్యంత సంక్లిష్టమైన క్యాన్సర్లను కూడా సులభంగా గుర్తించవచ్చని గ్రెయిల్ వైద్యుడు తెలిపారు. 1,34,000 మందిపై చేసిన క్లినికల్ ట్రయల్స్ సత్ఫలితాలనిచ్చినట్టు చెప్పారు. 50 ఏండ్లు పైబడిన వారి కోసం ఈ టెస్టు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. టెస్టు ఖరీదు 949 డాలర్లుగా (రూ. 70,417) వెల్లడించారు.