సిడ్నీ: ఇండియాతో జరుగుతున్న వరల్డ్కప్ మ్యాచ్లో నెదర్లాండ్స్ జట్టు పవర్ప్లేలో ఇద్దరు ఓపెనర్లను కోల్పోయింది. ఆరు ఓవర్లలో నెదర్లాండ్స్ రెండు వికెట్లు కోల్పోయి 27 రన్స్ చేసింది. 180 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ వేగంగా పరుగులు రాబట్టలేకపోయింది. విక్రమ్జిత్, మ్యాక్స్ ఓ డౌడ్(16) వికెట్లను నెదర్లాండ్స్ కోల్పోయింది. భువి, అక్షయ్లకు ఆ వికెట్లు దక్కాయి. అంతకుముందు ఇండియా రెండు వికెట్లకు 179 రన్స్ చేసిన విషయం తెలిసిందే. రోహిత్, కోహ్లీ, సూర్యకుమార్లు హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. తాజా సమాచారం ప్రకారం నెదర్లాండ్స్ 9.2 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 47 రన్స్ చేసింది.