ప్రపంచంలోని అతిపెద్ద ఓటీటీ ప్లాట్ఫాంలలో నెట్ఫ్లిక్స్ ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ వేదికకు కొత్త సంవత్సరంలో తిప్పలు తప్పడం లేదు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఏకంగా 2 లక్షల మంది కస్టమర్లను ఈ కంపెనీ కోల్పోయింది. ఈ ఏడాది ఏదో ఒకటి చేసి తమ కస్టమర్ల సంఖ్యను మరో 25 లక్షలు పెంచాలని నెట్ఫ్లిక్స్ లక్ష్యంగా పెట్టుకుంది.
ఆ టార్గెట్ మాట దేవుడెరుగు 2 లక్షల మంది సబ్స్క్రయిబర్లు కోల్పోవడంతో ఆ కంపెనీకి పెద్ద షాకే తగిలింది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాలు సేవలు నిలిపివేయడం, ఆర్థిక మాంద్యం, మార్కెట్లో పోటీ తదితర కారణాల వల్లే ఇలా సబ్స్క్రయిబర్లను కోల్పోయాని నెట్ఫ్లిక్స్ తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఓ మోస్తరుగా యాడ్లు వేస్తూ తక్కువ ధరకు కొత్త ప్లాన్లు అందించాలనే యోచనలో ఉన్నట్లు ఈ ఓటీటీ దిగ్గజం వెల్లడించింది.
తనకు ఇలా యాడ్లు రావడం ఇష్టం ఉండదని, కానీ కస్టమర్లకు నచ్చితే కచ్చితంగా చేస్తామని నెట్ఫ్లిక్స్ సీఈవో రీడ్ హేస్టింగ్స్ తెలిపారు. హెచ్బీవో మ్యాక్స్, డిస్నీ ప్లస్లలో ఇలాంటి యాడ్ ప్లాన్లు సక్సెస్ అయిన నేపథ్యంలోనే తాము కూడా ఈ ఆలోచన చేస్తున్నట్లు కంపెనీ అంటోంది. నెట్ఫ్లిక్స్ ఇలా కస్టమర్లను కోల్పోవడం గత దశాబ్ద కాలంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.