న్యూఢిల్లీ: జావెలిన్ త్రో ఈవెంట్లో మేటి అథ్లెట్ నీరజ్ చోప్రా కొత్త జాతీయ రికార్డును నెలకొల్పాడు. ఫిన్ల్యాండ్లో జరుగుతున్న పావో నుర్మి గేమ్స్లో తన జావెలిన్ను 89.30 మీటర్ల దూరం విసిరి నీరజ్ ఈ రికార్డు క్రియేట్ చేశాడు. గత ఏడాది మార్చిలో పాటియాలాలో జరిగిన ఈవెంట్లో 88.07 మీటర్ల దూరం విసిరి చోప్రా జాతీయ రికార్డును నెలకొల్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టేశాడు. గత ఏడాది ఆగస్టులో జరిగిన టోక్యో ఒలింపిక్స్లోనూ జావెలిన్ను 87.58 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.
తాజాగా జరిగిన పావో నుర్మి గేమ్స్లో నీరజ్ చోప్రా తన ఖాతాలో సిల్వర్ మెడల్ వేసుకున్నాడు. టోక్యో గేమ్స్ తర్వాత నీరజ్ తొలిసారి ఇంటర్నేషనల్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఫిన్ల్యాండ్ అథ్లెట్ ఒలివర్ హిలాండర్ తన జావెలిన్ను 89.83 మీటర్ల దూరం విసిరి గోల్డ్ మెడల్ను గెలుచుకున్నాడు. ఒలింపిక్స్ గేమ్స్ తర్వాత ఇచ్చిన తొలి ప్రదర్శనలోనూ నీరజ్ ఇరగదీశాడు. అసాధారణ ప్రతిభను కనబరిచాడు. దాదాపు 90 మీటర్ల మార్క్ను అతను టచ్ చేశాడు.
నుర్మి గేమ్స్ తొలి త్రోలో జావెలిన్ను 86.92 మీటర్ల దూరం విసిరాడు. ఆ తర్వాత రెండవ అటెంప్ట్లో 89.30 మీటర్ల దూరం విసిరాడు. ఇక ఆ తర్వాత మూడు ప్రయత్నాల్లో అతను ఫౌల్ అయ్యాడు. ఆరవ సారి 85.85 మీటర్ల దూరం విసిరాడు.
Golden Great @Neeraj_chopra1 does it again !
• Neeraj Chopra threw 89.30 metres at Paavo Nurmi Games to create a new National Record !
Absolutely THRILLED 😎
You’ve got to see his throw ! pic.twitter.com/wwKYLj9KU3
— Anurag Thakur (@ianuragthakur) June 14, 2022