న్యూఢిల్లీ, డిసెంబర్ 23: జీఎమ్మా ర్ గ్రూప్ వ్యాపారాల్ని రెండుగా విభజించనున్నారు. విమానాశ్రయేతర వ్యాపారాల్ని వేరుచేయాలన్న జీఎమ్మార్ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికకు తాజాగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అనుమతి లభించింది. ఎంపికచేసిన రంగాల్లో పెట్టుబడిచేసే అంతర్జాతీయ ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు కార్పొరేట్ వ్యవస్థను సరళీకృతం చేయాలని గతేడాది ఆగస్టులో జీఎమ్మార్ ఇన్ఫ్రా బోర్డు నిర్ణయించింది.
జీఎమ్మార్ పవర్ ఇన్ఫ్రా, జీఎమ్మార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జీఎమ్మార్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రాలు, ఆ కంపెనీల షేర్హోల్డర్ల పునర్వ్యవస్థీకరణ స్కీమ్కు ఈ డిసెంబర్ 22న ఎన్సీఎల్టీ ట్రిబ్యునల్ అనుమతినిచ్చిందని గురువారం విడుదలైన ప్రకటన తెలిపింది. ఎయిర్పోర్ట్, నాన్-ఎయిర్పోర్ట్ వ్యాపారాల్ని వేరువేరుగా లిస్ట్చేయడం.. తమ కార్పొరేట్ వ్యవస్థను సరళీకరించడానికి తోడ్పడుతుందని జీఎమ్మార్ పేర్కొంది.