న్యూఢిల్లీ: నక్సల్ ప్రభావిత జిల్లా సంఖ్య 46కు చేరినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. లోక్సభలో ఆయన లిఖితపూర్వక సమాధానం ద్వారా వెల్లడించారు. 2014లో 70 ఉన్న సంఖ్య 2021లో 46కు చేరినట్లు ఆయన తెలిపారు. తీవ్రవాద, నక్సల్స్ హింసాత్మక ఘటనలు కూడా క్రమంగా తగ్గుతున్నట్లు చెప్పారు. 2014లో 1091 ఘటనలు చోటుచేసుకోగా, 2021లో కేవలం 509 ఘటనలు జరిగినట్లు చెప్పారు.తీవ్రవాద ప్రభావిత జిల్లాలకు కేంద్ర సర్కార్ 2014 నుంచి అనేక స్కీమ్ల ద్వారా సాయం చేస్తోందని రాయ్ తెలిపారు.