ముంబై, ఏప్రిల్ 23: ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణాను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. వివిధ గ్రూపుల మధ్య శత్రుత్వాన్ని సృష్టించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్ర సీఎం ఠాక్రే నివాసం ‘మాతోశ్రీ’ ముందు తాము చాలీసా పఠించి తీరుతామని రాణా దంపతులు సవాల్ విసిరిన నేపథ్యంలో శనివారం ఉదయం మాతోశ్రీతో పాటు రాణా దంపతుల నివాసం వద్దకు పెద్దయెత్తున శివసేన కార్యకర్తలు చేరుకున్నారు. రెండు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే రాణా దంపతులు వెనక్కు తగ్గడంతో పరిస్థితి సద్దుమణిగింది.