వరుస సినిమాలతో బిజీగా ఉన్న నాని ఇటీవల టక్ జగదీష్ చిత్రంతో ప్రేక్షకులని పలకరించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఓటీటీలో విడుదల కాగా, ప్రేక్షకులని పెద్దగా అలరించలేకపోయింది. ఇక ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ అనే సినిమాలో నటిస్తున్నాడు నాని. ఈ సినిమాకు టాక్సీవాల ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి, మడోనా సెబాస్టియన్ తోపాటు లేటెస్ట్ సెన్సేషన్ కృతిశెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
మరోవైపు ‘అంటే.. సుందరానికి’ అనే సినిమా చేస్తున్నాడు నాని. ఈ సినిమాను ‘మెంటల్ మదిలో’ ‘బ్రోచేవారెవరురా’ ఫేం వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తున్నారు. రీసెంట్గా తన 29వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన దసరా రోజున రానుందని నాని తెలియజేశాడు. ఈ క్రమంలోనే దసరా అంటూ అందరినీ ఆకర్షించాడు. రగ్డ్ లుక్కుతో ఉన్న నాని దసరా అంటూ రాబోతోన్నాడు. ఈ దసరా నిరుడు లెక్క ఉండదు అంటూ ఏదో చెప్పేందుకు ప్రయత్నించాడు. చూస్తుంటే దసరా చిత్రంతో నాని సరికొత్త వినోదం అందించేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది.
ఈ సినిమాని శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించనున్నాడు. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుంది.ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు.