Cartoonist Mrityunjay | నమస్తే తెలంగాణ కార్టూనిస్ట్ మృత్యుంజయ్ ప్రతిభకు అరుదైన గౌరవం లభించింది. మన జీవితంలో చెట్ల ప్రాముఖ్యతను తెలపడంతో పాటు వృక్ష సంరక్షణకై జనాల్లో చైతన్యం నింపేలా ఆయన వేసిన కార్టూన్లను ప్రతిష్టాత్మక ట్రీటూన్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించబోతున్నారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్ ఆధ్వర్యంలో శనివారం (అక్టోబర్ 7వ తేదీన ) ప్రారంభం కానున్న ఈ ఎగ్జిబిషన్లో.. మృత్యుంజయ్ గీసిన దాదాపు 80 కార్టూన్లను ప్రదర్శించనున్నారు. అక్టోబర్ 21 వరకు ఈ ప్రదర్శన కొనసాగనుంది.
బీఆర్ఎస్ ఎంపీ సంతోశ్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో చెట్ల సంరక్షణపై అవగాహన కల్పిస్తూ ప్రముఖ కార్టూనిస్ట్ మృత్యుంజయ్ పలు కార్టూన్లను గీశారు. దాదాపు 8 నెలల పాటు శ్రమించి 200 కార్టూన్లను గీయడమే కాకుండా.. వాటన్నింటిని హరిత హాసం పేరిట ఒక బుక్ రూపంలోకి కూడా తీసుకొచ్చారు. ఇందులోని 80 కార్టూన్లను ఇప్పుడు ట్రీటూన్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించనుండటం విశేషం.
Mrityunjay Cartoon3