నీలగిరి, డిసెంబర్ 7: నల్లగొండ టూటౌన్ ఎస్సై దోరేపల్లి నర్సింహులు, కానిస్టేబుల్ ఎస్కే నాగుల్ మీరాను సస్పెండ్ చేసినట్టు ఎస్పీ ఏవీ రంగనాథ్ మంగళవారం తెలిపారు. కేసు విచారణ పేరుతో ఓ యువకుడిని తీవ్రంగా కొట్టి గాయపరిచినట్టు ఆరోపణలు వెల్లువెత్తగా చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నారు. డీటీసీ ఎస్పీ సతీశ్ చోడగిరి అందజేసిన తుది నివేదిక ఆధారంగా ఆ ఇద్దరినీ సస్పెండ్ చేసినట్టు వెల్లడించారు. కాగా, దళిత యువకుడిని తీవ్రంగా హింసిస్తున్నట్టుగా ఓ వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అయితే సదరు వీడియో క్లిప్పింగ్ నల్లగొండకు సంబంధించింది కాదని ఎస్పీ స్పష్టంచేశారు.