నందికొండ, జూలై 21 : సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్కు దీటుగా వసతులు చేకూరుతున్నాయని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. గురువారం పైలాన్ కాలనీలోని ప్రభుత్వ అభిరామేశ్వర ఆదర్శ ఉన్నత పాఠశాలను సందర్శించి పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు ప్రభుత్వం అందించిన పుస్తకాలను పంపిణీ చేశారు.
అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో నియోజకవర్గంలో పాఠశాలల పరిస్థితి అధ్వానంగా ఉండేదని, సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చేపడుతున్న చర్యలతో కొత్త రూపురేఖలు సంతరించుకుంటున్నాయన్నారు. మన ఊరి-మన బడి కార్యక్రమం కింద పాఠశాలలో రూ.కోటితో అన్ని రకాల వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు.
దాంతో పాఠశాలలో విద్యార్థులను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆశక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని చిన్న తనం నుంచే కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదుగాలని సూచించారు. అంతకు ముందు విద్యార్థులతో కలిసి సెల్ఫీలు దిగారు. వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీందర్రెడ్డి, వైస్ చైర్మన్ మంద రఘువీర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కర్న బ్రహ్మానందరెడ్డి, కౌన్సిలర్ నిమ్మల ఇందిర, నాయకులు నిమ్మల కొండయ్య, కర్న శరత్రెడ్డి, మోహన్నాయక్, చంద్రయ్య, సైదులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శేషు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.