నందికొండ, మార్చి 20 : పోరాడి తెలంగాణను సాధించడంతో పాటు రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న పార్టీ టీఆర్ఎస్ అని, అందుకే ప్రజలంతా పార్టీకి అండగా ఉన్నారని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ అన్నారు. శనివారం నందికొండ హిల్కాలనీ రెడ్డి ఫంక్షన్ హాల్లో సోషల్ మీడియా వారియర్స్తో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. విపక్షాల అసత్య ప్రచారాలను సోషల్ మీడియా ద్వారా తిప్పికొడుతూనే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. టీఆర్ఎస్ పార్టీ పుట్టక ముందు ప్రతిపక్షాలు తెలంగాణ ఊసే ఎత్తలేదని, ఆంధ్రా పాలకులకు ఊడిగం చేశాయని పేర్కొన్నారు. పదవులను త్యాగం చేసి తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి సీఎం కేసీఆర్ మాత్రమే అని అన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో జానారెడ్డి చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. సీఎం కేసీఆర్ పాలనలోనే ప్రజలకు అన్ని రకాల ప్రయోజనాలు అందుతున్నాయన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు, దేవరకొండ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, జాజాల సురేందర్, నందికొండ మున్సిపాలిటీ టీఆర్ఎస్ ఇన్చార్జి యాదగిరి సునీల్రావు, సుడా చైర్మన్ రామకృష్ణ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్న బ్రహ్మానందరెడ్డి, విష్ణువర్ధన్రావు, జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ మందరఘువీర్, కౌన్సిలర్లు ఇర్ల రామకృష్ణ, మంగ్తా, రమేశ్జీ, నిమ్మల ఇందిరాగౌడ్, నాగరాణి, నాగశిరీష, ఎంపీపీ భగవాన్నాయక్, సోషల్ మీడియా ఇన్చార్జీలు కృష్ణాక్, దినేశ్చౌదరి, జగన్మోహన్రావు, సతీశ్ పాల్గొన్నారు.